ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే చిన్నారులపై హత్యాచారాలు

by  |
ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే చిన్నారులపై హత్యాచారాలు
X

దిశ, మణుగూరు : ఏపీ ప్రభుత్వ పాలనలో ఆడ పిల్లలకు బతికే పరిస్థితి లేదని వైయస్సార్‌టీపీ పార్టీ పినపాక నియోజకవర్గ నాయకులు ఆలేం కోటి అన్నారు. ఆదివారం మండలంలోని సురక్ష బస్టాండ్ నుంచి అంబేద్కర్ టీడీపీ సెంటర్ వరకు వైయస్సార్‌టీపీ పార్టీ, రజక సంఘం, మహిళల ఆధ్వర్యంలో కీర్తి పావని హత్యాచారం ఘటనను ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆడపిల్లలు సమాజంలో బతికే పరిస్థితి లేదని, ఆడబిడ్డలకు ఎటువంటి రక్షణ లేదన్నారు.

ఆ పార్టీ అసమర్థత వల్లే ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. వైజాగ్ లో చిన్నారి కీర్తి పావనిపై హత్యాచాారం చేసిన నిందితులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు మరల పునరావృతం కాకుండా చూడాలన్నారు. నిందితులను ఉరితిస్తేనే మృతురాలు కీర్తి పావని ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో వైయస్సార్‌టీపీ జిల్లా నాయకులు, మండల నాయకులు, రజక సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed