షాకింగ్: షర్మిల సభకు విజయమ్మ

by  |
షాకింగ్: షర్మిల సభకు విజయమ్మ
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త పార్టీపై ప్రకటన చేసేందుకు ఈ నెల 9న ఖమ్మంలో లక్షమందితో భారీ బహిరంగ సభకు వైఎస్ షర్మిల శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సభకు భారీగా ఏర్పాట్లు జరుగుతుండగా.. తెలంగాణతో పాటు ఏపీ నుంచి కూడా భారీగా వైఎస్ అభిమానులు, షర్మిల అభిమానులు వచ్చే అవకాశముంది. సభా వేదికపై 100 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజాగా ఈ సభకు సంబంధించి ఒక షాకింగ్ వార్త బయటికొచ్చింది. షర్మిల బహిరంగ సభకు ఆమె తల్లి విజయమ్మ హాజరుకానున్నారని సమాచారం. తల్లిని పక్కన పెట్టుకుని పార్టీ ప్రకటన చేయాలని షర్మిల భావిస్తున్నారు. తన పార్టీకి తన తల్లి విజయమ్మ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఇప్పటికే షర్మిల ప్రకటించారు.



Next Story

Most Viewed