108 అంబులెన్స్‌లపై వైఎస్ షర్మిల ట్వీట్

by  |
YS Sharmila Twitter
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 108 వాహనాల పర్యవేక్షణ పట్టించుకోకుండా సీఎం కేసీఆర్​ ప్రజల ప్రాణాలను గాలికొదిలేశారని, 420 అంబులెన్సులకు 100 మాత్రమే తిరుగుతున్నాయని వైఎస్సార్​తెలంగాణ పార్టీ చీఫ్​షర్మిల ట్విట్టర్​వేదికగా మండిపడ్డారు. టీఆర్ఎస్​పాలనలో వాహనాలు సరిగ్గా ఉంటే డ్రైవర్లు ఉండరని, డ్రైవర్లు ఉంటే సరైన వేతనాలు ఇవ్వడంలేదని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 108 డ్రైవర్లకు 4 నెలల నుంచి వేతనాలు లేకపోవడంతో పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఆపదలో ఉన్నవారు 108 వాహనాలకు కాల్ చేస్తే బాధితుల వద్దకు సమయానికి చేరుకునేందుకు సరైన రోడ్లు లేక డ్రైవర్లు, రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొన్ని సందర్భాల్లో వైద్యం అందక ప్రాణాల మీదికి వస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పడికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారికి జీతాలు చెల్లించి 108 వాహనాలు నడిచేలా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed