జగన్‌ సర్కార్‌కు వైఎస్ షర్మిల వార్నింగ్

by  |
జగన్‌ సర్కార్‌కు వైఎస్ షర్మిల వార్నింగ్
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య కొన్ని రోజులుగా జలవివాదాలు నడుస్తున్నాయి. ఏపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి టార్గెట్‌గా తెలంగాణ మంత్రులు, నేతలు తీవ్ర వ్యాఖ్యల చేస్తున్నారు. తెలంగాణ మంత్రులు, నేతలు చేస్తున్న విమర్శలను ఏపీ మంత్రులు సైతం తిప్పి కొడుతున్నారు. తాజాగా జలవివాదాలపై వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోమని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అందుకు అవసరమైతే ఎవరితోనైనా పోరాడటానికైనా తాము సిద్ధమని ప్రకటించారు. అందుకు సంబంధించిన ఓ వీడియోను సైతం ట్యాగ్ చేశారు. తాను తెలంగాణపై పోరాటం చేస్తుందా…? అని చాలా మంది అనుకుంటున్నారని తెలంగాణ రాష్ట్రం కోసం తాను ఎవరితోనైనా పోరాడటానికి సిద్ధమంటూ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. వైఎస్ షర్మిల చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాబోయే రోజుల్లో తన అన్న, ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో రాజకీయ పోరుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed