KCR దొర.. డాక్టర్లుంటే బెడ్స్ ​లేవు.. బెడ్స్​ ఉంటే ఆక్సిజన్ ​లేదు : షర్మిల ఫైర్

by  |
KCR దొర.. డాక్టర్లుంటే బెడ్స్ ​లేవు.. బెడ్స్​ ఉంటే ఆక్సిజన్ ​లేదు : షర్మిల ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సెకండ్​వేవ్‌లో డాక్టర్లుంటే బెడ్స్ లేక, బెడ్స్ ఉంటే ఆక్సిజన్ లేక జనం పిట్టల్లా రాలిపోయారు. ఆ సమయంలో పారాసిటమల్ గోలి వేసుకంటే సరిపోతుందని సీఎం కేసీఆర్ ప్రజల ప్రాణాలను గాలికొదిలేశారని వైఎస్సార్​తెలంగాణ పార్టీ చీఫ్​షర్మిల ఫైరయ్యారు. ఇప్పుడు ఒమిక్రాన్​విస్తరిస్తోందని.. కనీసం ఇప్పుడైనా చేతులు కాలినంక ఆకులు పట్టుకోకుండా ప్రజల ప్రాణాలను కాపాడండి దొర అంటూ సోమవారం ట్విట్టర్​వేదికగా సెటైర్లు వేశారు.

ఇప్పటి నుంచే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చామని చేతులు దులుపుకోకుండా, కరోనా వైద్యం ఉచితంగా అందేలా చూడాలని షర్మిల డిమాండ్​చేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టి ప్రతీ ఒక్కరికీ కొవిడ్​రెండు డోసుల వ్యాక్సిన్ అందేలా చేయాలన్నారు. గతంలో కరోనాతో ఇల్లు గుల్ల అయిన కుటుంబాలకు కరోనా వైద్య బిల్లులు చెల్లించాలని ఆమె డిమాండ్​ చేశారు.


Next Story

Most Viewed