వర్షంలోనూ కొనసాగుతోన్న షర్మిల పాదయాత్ర

by  |
YS Sharmila
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్​షర్మిల వర్షంలోనూ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో షర్మిల తన 13వ రోజు పాదయాత్రను సోమవారం ప్రారంభించారు. చింతపల్లి మండలం మాల్‌టౌన్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర పోలెపల్లి గ్రామం మీదుగా ఎర్రమట్టి తండా, బోటిమేడ తండా, పాలెంతండా, చౌలాతండా, చాకలిషేర్‌పల్లి గ్రామానికి చేరుకుంది. ఈ క్రమంలో వానలోనూ తడుస్తూ షర్మిల ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు. భోజన విరామం అనంతరం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు యాత్ర ప్రారంభమై ఉమ్మపురం క్రాస్ మీదుగా గొల్లపల్లి గ్రామంలో మాట ముచ్చట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం సమైక్యనగర్, కుర్మేడ్ గేట్ మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది.



Next Story

Most Viewed