త్వరలోనే శుభవార్త చెబుతా.. కేసీఆర్, విజయశాంతి ఇక్కడి వారేనా? : షర్మిల

by  |
త్వరలోనే శుభవార్త చెబుతా.. కేసీఆర్, విజయశాంతి ఇక్కడి వారేనా? : షర్మిల
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రజలకు త్వరలోనే శుభవార్త చెబుతానని వైఎస్ షర్మిల అన్నారు. తాను పెట్టబోయే పార్టీకి బ్యాక్‌గ్రౌండ్ వర్క్, సిద్ధాంతాలు అన్ని సిద్ధం అవుతున్నాయని, త్వరలోనే పార్టీ పేరును ప్రకటిస్తానని వెల్లడించారు. తన పార్టీకి వైఎస్ విజయమ్మ మద్దతు ఉంటుందని.. ప్రాంతాలు, పార్టీల పరంగా మేము వేర్వేరుగా ఉండొచ్చని కానీ, అనుబంధాల్లోనూ, అన్నాచెల్లెల్లుగా తానూ, సీఎం జగన్ ఒకటేనని షర్మిల స్పష్టంచేశారు.

గత ఆగస్టు నెలలోనే తెలంగాణలో పార్టీ పెట్టాలనే ఆలోచన వచ్చిందని మీడియాకు వివరించారు. చాలా మంది తనను లోకల్ వ్యక్తిగా గుర్తించడం లేదనే విషయంపై షర్మిల స్పందిస్తూ.. తాను పుట్టింది, పెరిగింది తెలంగాణలోనే అని, తనకు హైదరాబాద్ సిటీ అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, విజయశాంతి ఇక్కడి వారేనా అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక తమ సమస్యలన్నీ తీరుతాయని ఇక్కడి ప్రజలు భావించారని.. కానీ ఏమైనా నేరవేరాయా అని అడిగారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారి గడపకు వెళ్లి వస్తానని ప్రకటించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ కోడలిగా… జై తెలంగాణ అని అన్నట్లు ఈ సందర్బంగా ఆమె చెప్పుకొచ్చారు.



Next Story