షర్మిల పార్టీకి స్పోక్స్ పర్సన్ల నియామకం..

by  |
షర్మిల పార్టీకి స్పోక్స్ పర్సన్ల నియామకం..
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల ఏర్పాటు చేయనున్న పార్టీకి స్పోక్స్ పర్సన్లను శుక్రవారం నియమించారు. షర్మిల ఆదేశానుసారం ఈ అడ్ హక్ అధికార ప్రతినిధుల నియామకాన్ని చేపట్టినట్లు ఆమె కార్యాలయవర్గం స్పష్టం చేసింది. స్పోక్స్ పర్సన్లుగా తొమ్మిది మందిని నియమించినట్లు లోటస్ పాండ్ వర్గీయులు తెలిపారు. అందులో కొండా రాఘవరెడ్డి, తూడి దేవేందర్ రెడ్డి, ఇందిరా శోభన్, పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, సయ్యద్ ముజ్టాబ్ అహ్మద్, మతిన్ ముజాదద్ది, భూమి రెడ్డి, బీశ్వ రవీందర్ ను నియమించినట్లు షర్మిల కార్యాలయం వెల్లడించింది.

Next Story

Most Viewed