- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకోకుండా సర్కార్ బడులు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని వైఎస్ షర్మిల శుక్రవారం ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ప్రొఫెసర్లు లేరని, అయితే ప్రభుత్వం మాత్రం విద్యార్థులు లేరని పాఠశాలలు మూసివేయడం ఎంత వరకు కరెక్టని ప్రశ్నించారు.
విద్యార్థుల జీవితాలతో ఆడుకోకుండా .. సర్కార్ బడుల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీ లలో ఉన్న అధ్యాపక కొలువులను, కాలిగా ఉన్న 1,91,000 కొలువులను వెంటనే భర్తీ చేయండి. (2/2)
— YS Sharmila (@realyssharmila) June 18, 2021
కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చి ఇలా మూసివేయడమేంటని షర్మిల ప్రశ్నలు సంధించారు. తెలంగాణ విద్యార్థులకు మీరందించే నాణ్యమైన విద్య ఇదేనా అంటూ కేసీఆర్ ప్రభుత్వానికి చురకలంటించారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకోకుండా రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1,91,000 కొలువులను వెంటనే భర్తీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.