ప్రైవేట్ ఆస్పత్రులు శవాన్ని కూడా ఇవ్వడం లేదు

by  |
ప్రైవేట్ ఆస్పత్రులు శవాన్ని కూడా ఇవ్వడం లేదు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య భయంకరంగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా.. వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాతో ప్రజలు ఆగమైపోతున్నారని మండిపడింది. బాధితులు ఆస్పత్రుల్లో డబ్బులు కట్టలేక ఆస్తులు అమ్ముకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. డబ్బులు కట్టనిదే శవాన్ని సైతం ఆస్పత్రులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని షర్మిల ట్విట్టర్‌ వేదికగా కోరారు.



Next Story

Most Viewed