- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: హుజురాబాద్ ఎన్నికలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శశాంక్ గోయల్ ను వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కలిశారు. ఎన్నికల నిబంధనలపై ఫిర్యాదు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ ను సస్పెండ్ చేయాలని లేదా బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హుజురాబాద్ లో నామినేషన్ ప్రక్రియ జరుగుతుందని, నామినేషన్ వేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు. రకరకాల కారణాలు చూపుతూ అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్ వేసేందుకు ముందుకు వస్తే తిప్పి పంపేస్తున్నారని కంప్లైట్ చేశారు.
సపోర్ట్ గా వచ్చే నాయకులను అడ్డుకుంటున్నారని, కేసులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసీఆర్ కి తొత్తులుగా మారారని, పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. హుజురాబాద్ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్ కేసీఆర్ కి అమ్ముడుపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నామినేషన్ గడువు సమయం కూడా పెంచాలని షర్మిల డిమాండ్ చేశారు.