వినాయక చవితి వేడుకల్లో వైఎస్ షర్మిల

by  |
YS Sharmila
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల పిలుపునిచ్చారు. వినాయక చవితి పురస్కరించుకొని శుక్రవారం లోటస్ పాండ్ లో గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీకి చెందిన ముఖ్య నేతలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి మాట్లాడుతూ..

నిరుద్యోగుల ప‌క్షాన పార్టీ అధినేత్రి ష‌ర్మిల తొమ్మిది వారాలుగా దీక్ష చేప‌డుతున్నా, కేసీఆర్ లో మాత్రం చ‌ల‌నం లేదని మండిపడ్డారు. వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పూజలో వైఎస్సార్ టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు భూమిరెడ్డి, స‌త్యవతి, రాష్ట్ర ప్రచార క‌మిటీ క‌న్వీన‌ర్ నీలం ర‌మేశ్, రాష్ట్ర ఐటీ వింగ్ క‌న్వీన‌ర్ ఇరుమ‌ళ్ల కార్తీక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆనంద్, అమృతా సాగ‌ర్, ఝాన్సీ రెడ్డి, క‌ల్పన, గాయత్రి, యువ‌జ‌న విభాగం నాయ‌కులు గోపి, సాయి త‌దిత‌రులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed