- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, చేవెళ్ల : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా కనిపించే బోనం ఎత్తుకోవడం సంతోషంగా ఉందని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామంలోని తన చిన్ననాటి స్నేహితురాలు రజిని ఇంట్లో బోనాల పండుగ సందర్భంగా ఆదివారం వారి కుటుంబ సభ్యులతో కలిసి బోనం ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆషాడమాసంలో అమ్మవారి ఆశీర్వాదం తెలంగాణలోని మహిళలందరికీ ఉండాలని కోరుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆషాడ మాసంలో ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే బోనాల పండుగ జాతర లో పాల్గొనడం తాను అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ సీనియర్ నాయకులు కొండా రాఘవరెడ్డి, ఏవూరి సోమన్న, పిట్ట రామ్ రెడ్డి వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story