వైఎస్ జగన్ సీబీఐ కేసు వాయిదా

by  |
వైఎస్ జగన్ సీబీఐ కేసు వాయిదా
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసును సీబీఐ రేపటికి వాయిదా వేసింది. ప్రజా ప్రతినిధుల కేసుల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పులో భాగంగా సోమవారం నుంచి ప్రతిరోజూ విచారణ కొనసాగనుంది. ఈ కేసులో జగన్‌పై 11చార్జీషీట్లు ఉన్నాయి. అయితే నాలుగు కేసులకు సంబంధించి హైకోర్టు గతంలోనే స్టే ఇవ్వడంతో అన్ని కేసులను కలిపి విచారించనుంది. ఇవాళ న్యాయమూర్తి సెలవులో ఉన్నందున కేసును మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఇన్‌చార్జ్ సీబీఐ న్యాయమూర్తి తెలిపారు.


Next Story