మెర్సిడెస్ కారును కాల్చేసిన యూట్యూబర్

by  |
మెర్సిడెస్ కారును కాల్చేసిన యూట్యూబర్
X

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియాలో చాలామంది వింత వింత స్టంట్స్‌తో కూడిన వీడియోలను అప్‌లోడ్ చేస్తుంటారు. అయితే వాటిలో కొన్ని వీడియోలను ఎందుకు చేస్తారో కూడా తెలియకపోగా.. కొన్నింటికీ అర్థమే ఉండదు. అలా ఓ రష్యన్ యూట్యూబర్.. ఏకంగా రూ. 70-80 లక్షల విలువ చేసే మెర్సిడెస్ కారును కాల్చేశాడు. అయితే అతడు అర్థం లేకుండా చేసిన పని కాదు ఇది. ఫ్రస్టేషన్‌తో చేశాడు. ఇంతకీ ఏమైంది? అతని ఫ్రస్టేషన్‌కు కారణమేంటి?

రష్యాకు చెందిన మిషా అలియాస్ మైఖేల్ లిట్విన్ యూట్యూబర్‌గా మంచి పేరు సంపాదించుకున్నాడు. తనను 5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు కూడా. ఇటీవలే మెర్సిడెస్ ఏఎమ్‌జీ జీటీ63 కారును కొనుగోలు చేశాడు. అయితే తాను ఇష్టపడి కొనుక్కున్న మెర్సిడెస్ కారులో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. దాంతో లిట్విన్ లోకల్ మెర్సిడెస్ డీలర్‌ వద్దకు రిపేర్‌కు తీసుకెళ్లాడు. అలా ఒక్కసారి కాదు.. ఐదు సార్లు రిపేర్‌కు తీసుకెళ్లినా.. ఆ డీలర్ రిపేర్ చేయకుండా తిరస్కరించడంతో ఫ్రస్టేషన్‌కు గురయ్యాడు. దీంతో ఆ కారు లోపల, బయటనే కాకుండా కారుకు కొంచెం దూరంలో.. ఓ దారిలా చేసి అక్కడున్న గడ్డిపై కూడా గ్యాసోలిన్ పోసి నిప్పంటించేశాడు. క్షణాల్లో ఖరీదైన కారు మంటల్లో కాలిపోయింది. తాను చేసిన ఈ పనిని మొత్తం వీడియోగా తీసిన లిట్విన్.. తన యూట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేశాడు. అది కాస్తా వైరల్ కావడంతో.. 10 మిలియన్ల మంది ఆ వీడియోను చూశారు.

కారును కాల్చేశాడు.. కానీ తన వీడియోకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మాత్రం వాటితోనే మరో కొత్త కారు కొనుక్కోవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇండియాలో అయితే మెర్సిడెస్ బెంజ్ జీటీ 63 ఎస్ 4 మాటిక్ ప్లస్ 4 డోర్ కోప్ ఎక్స్ షోరూమ్ ధరనే 2.4 కోట్లు ఉంది. బెంజ్ కంపెనీ ఖరీదైన కార్ మోడల్స్‌లో ఇది కూడా ఒకటి.



Next Story

Most Viewed