చైనా అధ్యక్షుడి దిష్టి బొమ్మ దగ్ధం

by  |
చైనా అధ్యక్షుడి దిష్టి బొమ్మ దగ్ధం
X

దిశ, ఆదిలాబాద్: భారత్-చైనా సరిహద్దుల వద్ద చోటు చేసుకున్న ఘర్షణ తీరుపై మండిపడుతూ నిరసనగా చైనా దేశ అధ్యక్షుడి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిరిపల్లి (హెచ్) గ్రామంలో గురువారం ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైనా వస్తువులను వాడబోమని గ్రామ యువకులు ప్రతినబూనారు. వీర మరణం పొందిన భారత సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.


Next Story