మద్యం తరలిస్తూ పట్టుబడ్డ యూత్ నాయకులు

by Sridhar Babu |
మద్యం తరలిస్తూ పట్టుబడ్డ యూత్ నాయకులు
X

దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో లాక్‌డౌన్ సందర్భంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమ మద్యం తరలిస్తున్న నామా యూత్ అధ్యక్షుడు దుద్దుకూరు రాజా చౌదరి పట్టుబడ్డాడు. రాజా చౌదరి మరో వ్యక్తితో కలిసి బూర్గంపహాడ్ మండల కేంద్రంలో పెద్దమ్మతల్లి వైన్స్ నుంచి మద్యాన్ని దొంగిలించినట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ మద్యం వ్యాపారం వెనుక ఒక మహిళా సర్పంచ్ హస్తం ఉన్నట్టు సమాచారం. ప్రజాప్రతినిధి కారులో మద్యం తరలించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కార్ సీజ్ చేసి, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు భద్రాచలం పోలీసులు తెలిపారు.

Tags : Youth leader, trafficked, police, liquor, badradri koathagudem, khammam



Next Story

Most Viewed