మొన్న ఏపీ.. నేడు తెలంగాణ

by  |
మొన్న ఏపీ.. నేడు తెలంగాణ
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని నూజివీడులో ఓ లేడీస్ హాస్టల్‌లోకి యువకుడు దూరిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా నార్నూల్ మండలంలోని ఓ లేడీస్ హాస్టల్‌లో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. ఈ నెల 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 17వ తేదీ మధ్యాహ్నంపూట కుమురంభీం జిల్లాకు చెందిన ఓ యువకుడు ప్రహారీగోడ దూకి.. లేడీస్ హాస్టల్‌లోకి దూరాడు. ఆ యువకుడి స్నేహితురాలు, ఇంటర్మీడియట్ విద్యార్థిని అదే హాస్టల్‌లో ఉంటున్నది. ఆమెను చూసేందుకే ఆ హాస్టల్‌లోకి వెళ్లినట్టు తెలిసింది. అయితే, అదే గదిలో మరోముగ్గురు బాలికలు ఉన్నా విషయం మాత్రం బయటకు రాలేదు. అయితే, పొద్దున హాస్టల్ శుభ్రం చేయడానికి వెళ్లిన సిబ్బంది కంట ఆ యువకుడు పడటంతో బండారం బయటపడింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకొన్న పోలీసులు.. ఆ యువకుడికి, విద్యార్థినికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

Next Story

Most Viewed