- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : ఇటీవలే ఆంధ్రప్రదేశ్లోని నూజివీడులో ఓ లేడీస్ హాస్టల్లోకి యువకుడు దూరిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా నార్నూల్ మండలంలోని ఓ లేడీస్ హాస్టల్లో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. ఈ నెల 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 17వ తేదీ మధ్యాహ్నంపూట కుమురంభీం జిల్లాకు చెందిన ఓ యువకుడు ప్రహారీగోడ దూకి.. లేడీస్ హాస్టల్లోకి దూరాడు. ఆ యువకుడి స్నేహితురాలు, ఇంటర్మీడియట్ విద్యార్థిని అదే హాస్టల్లో ఉంటున్నది. ఆమెను చూసేందుకే ఆ హాస్టల్లోకి వెళ్లినట్టు తెలిసింది. అయితే, అదే గదిలో మరోముగ్గురు బాలికలు ఉన్నా విషయం మాత్రం బయటకు రాలేదు. అయితే, పొద్దున హాస్టల్ శుభ్రం చేయడానికి వెళ్లిన సిబ్బంది కంట ఆ యువకుడు పడటంతో బండారం బయటపడింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకొన్న పోలీసులు.. ఆ యువకుడికి, విద్యార్థినికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.