- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, చెన్నూర్ : హైద్రాబాద్కి చెందిన చైత్ర అనే పసిపాపను అమానుషంగా అత్యాచారం చేసి అతి కిరాతకంగా హతమార్చిన ఘటనను నిరసిస్తూ యవకులు నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని ప్రతాప మారుతి హనుమాన్ మందిరము నుంచి గాంధీ చౌక్ వరకు పార్టీలకతీతంగా యువకులు పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ నిందితుడిని ఉరి తీయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ చౌక్ లో ఏర్పాటుచేసిన సభలో పలువురు యువకులు మాట్లాడుతూ రోజురోజుకు పసికందుల పై అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ సరైన శిక్ష పడకుండా న్యాయవ్యవస్థ లో ఉన్న లోపల కారణంగా తిరిగి రోడ్డు మీద తిరుగుతూ అత్యాచారాలకు గురి చేస్తున్నారని అటువంటి వారిని ఉరితీయాలని వారు డిమాండ్ చేశారు. ర్యాలీలో పట్టణంలోని అన్ని విద్యార్థి సంఘాల నాయకులు ,కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.