న‌ల్ల బ్యాడ్జీల‌తో భార‌త క్రికెట‌ర్లు..కార‌ణం ఇదే

by velandi.Saikiran |

లార్డ్స్ వ‌న్డే నేప‌థ్యంలో ఇంగ్లాండ్, భార‌త క్రికెట‌ర్లు న‌ల్ల బ్యాడ్జీల‌తో బ‌రిలోకి దిగారు.

న‌ల్ల బ్యాడ్జీల‌తో భార‌త క్రికెట‌ర్లు..కార‌ణం ఇదే
X

దిశ‌, వెబ్ డెస్క్: భారత్, ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ వేదికగా కాసేపటి క్రితమే మూడో వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో టాస్ గెలిచి, బ్యాటింగ్ ఒక దిగింది ఇంగ్లాండ్. బుమ్రాకు గాయం కావడంతో అతడు మ్యాచ్ కు దూరమయ్యాడు. మొత్తం మూడు మార్పులతో బరిలోకి దిగింది భారత్. కొత్త‌గా కేఎల్ రాహుల్, అర్ష‌దీప్‌, ప్రిన్స్ యాద‌వ్ ఇవాళ ఆడుతున్నారు.

నల్ల బ్యాడ్జీలతో బరిలోకి దిగిన ప్లేయర్లు

లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే నేపథ్యంలో భారత్, ఇంగ్లాండ్ క్రికెటర్లు నల్ల బ్యాడ్జీలతో బరిలోకి దిగారు. తాజాగా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ మృతి చెందారు. ఆయన మృతికి నివాళిగా నల్ల బ్యాడ్జీలతో ప్లేయర్లు ఇవాళ మ్యాచ్ ఆడుతున్నారు. మ్యాచ్ ప్రారంభానికి అంటే ముందు దాదాపు రెండు నిమిషాల పాటు స్టేడియంలో నిశ్శబ్దంగా నిలబడి శ్రద్ధాంజలి ఘటించారు. ప్లేయర్లతో పాటు క్రికెట్ అభిమానులు కూడా నిలబడి సంతాపం తెలిపారు.

Next Story