- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, అలంపూర్ : మద్యం సేవించిన మైకంలో ఓ యువకుడు అర్థరాత్రి దాటాక తర్వాత తల్లితో గొడవపడి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉండవెల్లి మండలం బొంకూర్ గ్రామంలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. మహేష్(20) అనే యువకుడు మద్యానికి బానిసై డబ్బుల కోసం తల్లిని ప్రతిరోజూ ఇబ్బందులకు గురిచేసేవాడు. ఈ క్రమంలోనే బుధవారం సాయంకాలం మద్యం సేవించి అర్ధరాత్రి ఇంటికి వచ్చిన కుమారుడిని తల్లి మద్దమ్మ నిలదీసింది.
తాగిన మైకంలో ఉన్న మహేష్ తల్లితో కాసేపు వాగ్వివాదం పెట్టుకున్నాడు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న పెట్రోల్ మీద పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన అతడు గట్టిగా కేకలు పెడుతూ బయటకు వచ్చాడు. చుట్టుపక్కల గమనించి మంటలను ఆర్పారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. గాయపడిన యువకుడిని గ్రామస్తులు అదే రాత్రి కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న మహేశ్ పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు.