అన్న మరణ వార్త విని తమ్ముడు మృతి 

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: అన్న మరణ వార్త భరించలేక తమ్ముడు గుండె పోటుతో కుప్పకూలిన విషాద ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని మార్లపల్లిలో చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళితే.. మార్లపల్లిలో నివసిస్తున్న తిమ్మయ్య, సుబ్బమ్మల సంతానం శామ్యూల్, సుందర్ రాజు. శామ్యూల్ దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ.. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. అన్న మరణ వార్త బంధువుల ద్వారా తెలుసుకున్న తమ్ముడు సుందర్రాజు తట్టుకోలేక అప్పుడే గుండె పోటుకు గురై మరణించినట్లు బంధువులు [&hellip;]</p>

అన్న మరణ వార్త విని తమ్ముడు మృతి 
X

దిశ, వెబ్ డెస్క్: అన్న మరణ వార్త భరించలేక తమ్ముడు గుండె పోటుతో కుప్పకూలిన విషాద ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని మార్లపల్లిలో చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళితే.. మార్లపల్లిలో నివసిస్తున్న తిమ్మయ్య, సుబ్బమ్మల సంతానం శామ్యూల్, సుందర్ రాజు. శామ్యూల్ దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ.. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. అన్న మరణ వార్త బంధువుల ద్వారా తెలుసుకున్న తమ్ముడు సుందర్రాజు తట్టుకోలేక అప్పుడే గుండె పోటుకు గురై మరణించినట్లు బంధువులు తెలిపారు. అన్నదమ్ముల చావుతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story