- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మొయినాబాద్: హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో అతివేగంతో కారు నడిపిన ఓ వ్యక్తి స్కూటీని ఢీకొట్టాడు. స్కూటీపై వెళ్తున్న యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం అర్ధరాత్రి ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన మోర వెంకటేష్ కూతుర్లు ప్రేమిక (16), సౌమ్య, అక్షయ శనివారం రాత్రి సమయంలో స్కూటీపై కనకమామిడి వైపు వెళ్తున్నారు. అదే సమయంలో చేవెళ్ల వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అతివేగంతో ఎదురుగా వచ్చి స్కూటీని ఢీకొట్టింది.
దీంతో స్కూటీపై ఉన్నా ముగ్గురు రోడ్డుపై పడిపోయారు. ప్రేమిక అనే యువతికి తలకు ఎక్కువగా గాయాలవ్వడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మిగిలిన ఇద్దరికి గాయాలు అవ్వడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. అతివేగంతో కారు నడపడం వల్లే ప్రమాదం జరిగింది అని మొయినాబాద్ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.