- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, నిజామాబాద్: రెండేళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి తమ గ్రామాన్ని ఏం అభివృద్ధి చేశారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేంధర్ను గండిమాసానిపేట్కు చెందిన యువకులు నీలదిశారు. గ్రామస్తులు ఓట్లు వేయలేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో పాదయాత్రకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్న వాహిద్, తలారి సతీష్లు.. ముందుగా గ్రామానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 500 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు అయినా వాటిని నిర్మించలేదన్నారు. కరోనా సాకుతో అభివృద్ధి పనులు చేయడం లేదని చెప్పడం ఏంటన్నారు. గ్రామంలో మిషన్ భగీరథ నీల్లు ఇస్తామని చెప్పి.. నళ్లాలు బిగించారని.. కానీ, నీరు రాని నళ్లాలతో ప్రయోజనం లేకుండా పోయిందని విమర్శించారు. అటు సీసీ రోడ్ల పనులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని.. కనీసం ఇప్పటికైనా ప్రజా ప్రతనిధులు చొరవతీసుకొని పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల మధ్య స్పల్ప ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకోవడంతో స్థానిక లీడర్లు జోక్యం చేసుకొని యువకులకు నచ్చజెప్పారు.