టీచర్ కూతురిపై దారుణానికి ఒడిగట్టిన దుండగులు

by  |
Teacher-Koothuru1
X

దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో అల్లరి మూకలు మరోసారి వీరంగం సృష్టించాయి. పాలకేంద్రం ఏరియాలో నివసిస్తున్నటువంటి ఓ ప్రైవేట్ ఉపాధ్యాయురాలిని అదే ఏరియాకి చెందిన కొందరు యువకులు అసభ్యకర పదజాలంతో దూషించారు. పక్కనే ఉన్న తన మేనల్లుడు వారి అసభ్యకర మాటలు విని అడ్డు చెప్పే ప్రయత్నం చేశాడు. మాకే ఎదురు చెప్తావా అంటూ మేనల్లుడు అనుదీప్ పై, ఉపాధ్యాయురాలి కూతురిపై కారం చల్లి దాడికి పాల్పడ్డారు. దీంతో వారిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సింగరేణి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Next Story