షాకింగ్.. ప్రయాణికులతో వెళ్తున్న బస్సుకు నిప్పంటించిన యువకుడు..

by  |
Fire Accident in kukatpally
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం ప్రయాణికుతో వెళ్తున్న బస్సుపై పెట్రోల్ పోసి ఓ యువకుడు నిప్పంటించాడు. వివరాల ప్రకారం.. జిల్లాలోని కనిగిరిలో వెలిగండ్ల మండలం మొగులూరుకు చెందిన రామగిరి ఏడుకొండలు అనే యువకుడు.. ఆగి ఉన్న బస్సుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అది గమనించిన వెంటనే అప్రమత్తమై వెంటనే మంటలను ఆర్పారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే ఈ దారుణానికి ఒడిగట్టిన యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే విచారణ సందర్భంగా సదరు యువకుడికి మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు గుర్తించినట్టు తెలిపారు.



Next Story