క్లాస్‌రూమ్‌లో బాలికకు మూడు ముళ్లు వేస్తుండగా…

by  |
క్లాస్‌రూమ్‌లో బాలికకు మూడు ముళ్లు వేస్తుండగా…
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో నెలరోజుల క్రితం ఓ జూనియర్ కాలేజీలో విద్యార్థినికి తాళికట్టిన వీడియో వైరల్ అయిన విషయాన్ని మరువక ముందే తూర్పుగోదావరి జిల్లాలో అలాంటి సంఘటనే సోమవారం జరిగింది. కానీ ఈసారి బాలిక మెడలో మూడు ముళ్లు పడలేదు. రాయవరం ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ విద్యార్థినికి సత్తిరెడ్డి యువకుడు తాళికట్టేందుకు ప్రయత్నించగా.. అదే క్లాస్ రూమ్‌లో ఉన్న విద్యార్థిని సోదరుడు అడ్డుకోవడంతో సత్తిరెడ్డి పరుగులు తీశాడు. ఇంటికి వెళ్లి వెంటనే సత్తిరెడ్డి పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో నెలరోజుల వ్యవధిలో రెండుచోట్ల క్లాస్‌ రూముల్లో విద్యార్థులు పెళ్లిళ్లు చేసుకునేందుకు ప్రయత్నాలు చేయడం తల్లిదండ్రులను కలవరపాటుకు గురి చేస్తోంది.

Next Story

Most Viewed