అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

by  |
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
X

దిశ, రంగారెడ్డి: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గండిపేట మండలం కోకాపేటలో వసుంధరా రెడ్డి తన కుమారుడు ఆకాశ్ రెడ్డితో కలిసి ఉంటుంది. భర్తతో విభేదాల కారణంగా ఆమె ఆరు ఏళ్ల కింద విడాకులు తీసుకుంది. శుక్రవారం ఆకాశ్‌రెడ్డి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.



Next Story

Most Viewed