ఉద్యోగం రాలేదు.. ఉండలేకపోయాడు

by  |
ఉద్యోగం రాలేదు.. ఉండలేకపోయాడు
X

దిశ, ఆదిలాబాద్: ఆ యువకుడి వయస్సు 25 ఏళ్లు. ఏదో ఒక ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండాలనుకున్నాడు. ఉద్యోగం కోసం విశ్వప్రయత్నాలు చేశాడు. కానీ, ఎక్కడ ఉద్యోగం లభించలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సదరు యువకుడు నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన దాసారపు వినిత్‌రావు(25) ఉద్యోగం రాలేదని తీవ్ర మనస్తాపం చెంది శనివారం గూడెం సమీపంలోని గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అతని కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


Next Story