- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: రోజు రోజుకు చిన్నారులపై మృగాళ్ల అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. పసికందులను కామ వాంఛలతో చిదిమేస్తున్నారు. సైదాబాద్ కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటన ఇంకా మరువకముందే మరో కామాంధుడు ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. బీ కొత్తపేట మండలంలో ఇందిరమ్మకాలనీలో ఇద్దరు చిన్నారులు మంగళవారం రాత్రి ఆరుబయట ఆడుకుంటున్నారు. అయితే వారి ఇంటి పక్కన ఉండే అనిల్ కుమార్(21) అనే కీచకుడి కళ్లు వారిపై పడ్డాయి.
ఆడుకుంటున్న వారివద్దకు చేరుకుని మాయమాటలు చెప్పాడు. ఆ తర్వాత వారిని మిద్దెపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మొదట 9 ఏళ్ల వయసున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఏడేళ్ల వయసున్న చిన్నారిని తొడలపై కూర్చోపెట్టుకొని అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. ఇక దీంతో తొమ్మిదేళ్ల చిన్నారి ఏడుస్తూ కిందకు వెళ్లి తన అమ్మమ్మ సావిత్రికి చెప్పింది. దీంతో సావిత్రి వెంటనే మిద్దేమీదకు వెళ్లి చూడగా కామాంధుడు చిన్నారిని లైంగికంగా వేధిస్తూ కనిపించాడు. వెంటనే సావిత్రి దిశయాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐదు నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకున్నపోలీసులు కీచకుడు అనిల్ కుమార్ను అదుపులోకి తీసుకొని అతనిపై పోక్సోచట్టం కింద కేసు నమోదు చేశారు., చిన్నారులను చిదిమేస్తున్న ఇలాంటి కామాంధులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరారు.