వెల్డింగ్ చేస్తూ యువకుడి మృతి

by  |
వెల్డింగ్ చేస్తూ యువకుడి మృతి
X

దిశ, కరీంనగర్: సుల్తానాబాద్ మండంలో కాట్నపల్లిలోని కనకదుర్గా రైస్‌మి‌ల్‌లో వెల్డింగ్‌ వర్స్‌ చేస్తూ బత్తిని శేఖర్‌(22) అనే యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కనకదుర్గ రైస్‌మ్లిలో డ్రైన్‌ వెల్డింగ్‌ పనుల నిమిత్తం ఒక కాంట్రాక్టరుకు సదరు రైస్‌మ్లిల్లు యాజమాన్యం పని అప్పగించారు. ఎన్‌టీపీసీకి చెందిన బత్తిని శేఖర్ అనే కార్మికుడు వెల్డిండ్‌ చేస్తుండగా తీవ్రంగా పొగ రావడంతో ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయిన శేఖర్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే సుల్తానాబాద్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స అందించేలోపునే శేఖర్‌ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా శేఖర్‌ తండ్రి వికలాంగుడని కుటుంబ భారం మొత్తం శేఖర్‌పైనే ఆధారపడ్డారని, అన్ని విధాల శేఖర్‌ కుటుంబాన్ని ఆదుకోవాని కుటుంబ సభ్యులు, కార్మికులు కోరుతున్నారు. మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఉపేందర్‌రావు తెలిపారు.



Next Story

Most Viewed