ఇసుకాసురుల కాసుల దాహానికి యువకుడు బలి..!

by  |
ఇసుకాసురుల కాసుల దాహానికి యువకుడు బలి..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఇసుకాసురులు కాసుల దాహానికి యువకుడు బలి అయ్యాడు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం బిచ్కుంద మండలం వాజిద్ నగర్ వద్ద జరిగింది. బిచ్కుంద పరిధిలో ఉన్న క్వారీల నుంచి పరిమితికి మించి ఇసుకను తరలిస్తున్న టిప్పర్.. నస్రుల్లాబాద్ మండలం అంకుల్ తండాకు చెందిన రూప్ లా నాయక్ (30) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎగిరి మురికి కాలువలో పడ్డ అక్కడికక్కడే రూప్‌లా నాయక్ ప్రాణాలు వదిలాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి కారణం అయిన టిప్పర్‌ను స్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది.


Next Story

Most Viewed