లారీ ఢీకొని యువకుడు మృతి

by  |
లారీ ఢీకొని యువకుడు మృతి
X

దిశ, భద్రాచలం : లారీ ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన భద్రాచలం పట్టణం కూనవరంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. రాయపాటి నరేందర్ (27) అనే యువకుడు ఇంటి వద్ద నుంచి బయలుదేరి తన లాండ్రీ షాపు వద్దకు వస్తున్నాడు. ఈ క్రమంలో సీఆర్‌పిఎఫ్ క్యాంపు ఆఫీసు సమీపంలో రోడ్డుపై వస్తున్న నరేందర్‌ని టీఎన్ 70 జె 4563 నంబర్ గల లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. ఆ లారీ రాయిపూర్ నుంచి బయలుదేరి చెన్నైకి వెళ్తూ భద్రాచలంలో ప్రమాదానికి కారణమైంది. మృతుడికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. పోలీసులు లారీ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకొన్నట్లు సమాచారం.



Next Story

Most Viewed