శ్రీ రాజా రాజేశ్వర జలాశయంలో యువకుడి మృతదేహం

by  |
శ్రీ రాజా రాజేశ్వర జలాశయంలో యువకుడి మృతదేహం
X

దిశ, వేములవాడ: శ్రీ రాజా రాజేశ్వర జలాశయం లో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోదురుపాకలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కొదురుపాకకు చెందిన సారాంపల్లి రాజు (37)అనే వ్యక్తి శ్రీ రాజా రాజేశ్వర జలాశయం లో దూకి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఆదివారం కోదురుపాక నాలుగు లైన్ల వంతెన వద్ద ఉదయం 4 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనం,చెప్పులు ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులు కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జాలర్ల సహాయముతో గాలింపు చర్యలు చేపట్టగా రాజు మృతదేహం దొరికింది. పంచనామా చేసిన అనంతరం పోస్ట్ మార్టం సిరిసిల్ల కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య రేణుక ఇద్దరు కూతుర్లు నిశిత,రిషితలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed