యువకుడు మృతి.. బంధువుల పనే అంటున్న కుటుంబ సభ్యులు

by  |
యువకుడు మృతి.. బంధువుల పనే అంటున్న కుటుంబ సభ్యులు
X

దిశ,దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన యువకుడు మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని కొందరు.. బంధువులే హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తూ మండల కేంద్రంలో ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు కుటుంబ సభ్యులకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మండల కేంద్రానికి చెందిన సిలివేరి వేణు (22) ఓ బైక్ మెకానిక్ గా పని చేస్తున్నాడు. కాగా, దసరా సందర్భంగా బంధువులతో కలిసి చేగుంట మండల కేంద్రానికి వెళ్ళాడు. తిరిగివస్తుండగా రెడ్డి పల్లి దగ్గరలోని దాబాలో టీ తాగిన వారు రోడ్డు ప్రమాదం జరిగి మృతిచెందాడని, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం అది ప్రమాదం కాదు బంధువులే ఉద్దేశపూర్వకంగా వేణును హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని చేపట్టారు. నిందితులను అరెస్టు చేసే వరకు కదిలేది లేదని దౌల్తాబాద్ శివాజీ చౌరస్తాలో శవంతో సహా ఆందోళనకు దిగారు. సుమారు మూడు గంటలపాటు దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Next Story

Most Viewed