రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

by  |
Raguram
X

దిశ, భువనగిరి రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి రైల్వే స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని రాంనగర్‌కు చెందిన నెర్రోలు రఘురాం(26) గత శనివారం రాత్రి 8 గంటలకు దావత్ ఉందని ఇంట్లో చెప్పి స్నేహితులతో కలిసి యాదగిరిగుట్టకు బైక్‌పై వెళ్లాడు. తిరిగి ఆదివారం హైదరాబాద్‌లో బోనాలు కావడంతో ఇంటికి వస్తుండగా మార్గం మధ్యలో రాయగిరి రైల్వే స్టేషన్ బ్రిడ్జి వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న డివైడర్‌ను ఢీ కొన్నాడు. దీంతో తలకు బలమైన గాయం అయింది. స్థానికులు గమనించి 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందినట్లు సమాచారం. రఘురాం తండ్రి నర్సింగరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రఘురాం పలు బైక్ రైడింగ్‌లో పాల్గొని, కొన్ని అవార్డులు గెలుచుకున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed