రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

by  |

దిశ, మెదక్: రోడ్డు ప్రమాదం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి చెందిన నవీన్(27) రోడ్డు ప్రమాదంలో మ‌ృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నవీన్ హైదరాబాద్‌‌లోని గచ్చిబౌలి ఐసీఐసీఐ బ్యాంక్‌లో పని చేస్తున్నాడు. అయితే లాక్‌డౌన్ కారణంగా నవీన్ ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సొంత పని మీద బయటకు వెళ్లిన నవీన్ . . అదే రోజు రాత్రి 10 గంటలకు దిగ్వాల్ నుంచి జహీరాబాద్‌కు వస్తుండగా, మధ్యలోనే బైక్ అదుపు తప్పి కిందపడటంతో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags: road accident, sangareddy, young man dead, crime news

Next Story

Most Viewed