- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, బూర్గంపాడు: తన తల్లి చనిపోవడంతో గత మూడేళ్లుగా మనోవేదనకు గురై కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం బూర్గంపాడు మండల పరిధిలోని ముసలిమడుగులో చోటుచేసుకుంది. ఎస్సై ఖాజా నసీరుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం… బూర్గంపాడు మండల కేంద్రంలోని గౌతమీపురం కాలనీకి చెందిన షేక్ షరీఫ్ పాషా(26) తన తల్లి గత మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది.
అప్పటి నుంచి దిగాలుగా ఉంటూ తనలో తానే మనోవేదనకు గురయ్యేవాడు. గత రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆదివారం వెళ్లిన వ్యక్తి ఇంటికి తిరిగి రాకపోవడంతో తండ్రి షేక్ పెద్ద యాకూబ్ కుటుంబ సభ్యులతో కలిసి అంతా వెతికారు. మంగళవారం ఉదయం మండల పరిధిలోని ముసలిమడుగు డబుల్ బెడ్రూం ఇళ్ల సమీపంలో ఖాళీగా ఉన్న పొలాల్లో పురుగుమందు సేవించి విగతజీవిగా కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి అదనపు ఎస్సై ఖాజా నసీరుద్దీన్ సిబ్బందితో కలిసి చేరుకున్నారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.