అమ్మగుడిలోనే అనంతలోకాలకు

by  |
అమ్మగుడిలోనే అనంతలోకాలకు
X

దిశ, సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం అంకూసాపూర్ గ్రామ శివారులోని పెద్దమ్మ గుడి ఆవరణలో ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. చనిపోయిన వ్యక్తిని నాగర్‌కర్నూల్‌ జిల్లా తలకొండపల్లికి చెందిన రాజ్‌కుమార్‌(27)గా పోలీసులు గుర్తించారు. రాజ్‌కుమార్‌ హైదరాబాద్‌లో టీ మాస్టర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అంకుసాపూర్‌కు బైక్‌పై వచ్చిన రాజ్‌కుమార్‌ పెద్దమ్మ ఆలయం వద్ద ఉరేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed