ప్రాణం తీసిన భూ తగాదాలు

by  |
ప్రాణం తీసిన భూ తగాదాలు
X

దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో భూ తగాదాలతో యువకుడిని దారుణంగా హత్య చేశారు. పోలీసుల వివరాల ప్రకారం… సారంగాపూర్ మండలంలోని బట్టపెల్లి గ్రామానికి చెందిన కొక్కుల సతీష్(28) గత రెండ్రోజులుగా కనిపించకపోగా, కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు సోమవారం బట్టపల్లి, నేరెళ్ల గ్రామాల మధ్యలో శవమై కనిపించాడు. సతీష్‌కు గ్రామానికి చెందిన ఇద్దరితో భూ తగాదాలు ఉన్నాయని, భూతగాదాలే సతీష్ హత్యకు కారణాలని ఆ దిశగా విచారణ చేస్తున్నట్టు ఎస్ఐ రాజయ్య తెలిపారు.

Next Story

Most Viewed