దారుణం : ప్రేమకు ఒప్పుకోలేదని, యువతిని లాడ్జ్‌కి తీసుకెళ్లిన యువకుడు.. చివరికి

by  |
దారుణం : ప్రేమకు ఒప్పుకోలేదని, యువతిని లాడ్జ్‌కి తీసుకెళ్లిన యువకుడు.. చివరికి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో దారుణం జరిగింది. ప్రేమకు నిరాకరించిందని ప్రేమికుడు ప్రేమికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటిచాడు. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. విశాఖకు చెందిన అమ్మాయిని వరంగల్‌కు చెందిన అబ్బాయి గత కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన ప్రేమను ఒప్పుకోవాలని పలుమార్లు బతిమిలాడిన అమ్మాయి ఒప్పుకోకపోవడంతో యువకుడు ఒక రోజు నీతో మాట్లాడలని యువతిని లాడ్జ్‌కి తీసుకెళ్లాడు. మరోసారి యువతిని ప్రేమను ఒప్పుకోవాలని కోరిన యువతి ప్రేమకు నిరాకరించడంతో ఆగ్రహానికి లోనైన యువకుడు తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్‌ను యువతిపై పోసి తగలబెట్టాడు. తర్వాత ఒంటి పై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని లాడ్జ్ సిబ్బంది గమనిచడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, పూర్తిగా కాలిన గాయాలతో ఉన్న ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇంత ఘోరమా .. ప్రేమించిందని గ్రామం నడిబొడ్డున అలా చేసిన గ్రామస్తులు ..

Next Story

Most Viewed