మృతిచెందిన గర్భవతిని రూంకు తీసుకొచ్చి.. అలా చేసిన యువకుడు అరెస్ట్

by  |
మృతిచెందిన గర్భవతిని రూంకు తీసుకొచ్చి.. అలా చేసిన యువకుడు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: గర్భం దాల్చిన ఓ యువతిని రూంకు తీసుకువచ్చి యువకుడు హత్య చేసిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రంలోని గంజి జిల్లా మధు సారియా గ్రామానికి చెందిన రాజ్ దూత్, కవితకుమారి(20) గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరూ శారీరకంగా కలుసుకోవడంతో ఆ యువతి గర్భం దాల్చింది. దీంతో తనని ఎక్కడికైనా తీసుకెళ్లాలని ఆ యువతి ప్రియుడిని బలవంతం చేసింది. చెన్నైలో జాబ్ చేస్తున్న ప్రియుడు ఆ యువతిని ఏపీలోని చిత్తూరు జిల్లాకు తీసుకొచ్చాడు. చిత్తూరులో ఓ సెల్ ఫోన్ షాపులో ఫోన్ రిపేరు చేయించుకున్నారు. అదేవిధంగా ఆ యువతిని పెనుమూరులో ఉన్న ఓ కాలేజీలో చేర్పించేందుకు ప్రయత్నించాడు. కానీ, సీటు లభించలేదు. దీంతో కలవగుంట పంచాయతీ విజయనగరం యానాదికాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే ఉంటున్నారు.

అబార్షన్ చేయించుకోవాలని ఆ యువతిపై ప్రతిరోజూ అతను ఒత్తడి తెచ్చేవాడు. అందుకు ఆ యువతి నిరాకరించింది. దీంతో ఆమెను హతమార్చాలని స్కెచ్ వేశాడు. అనుకున్న విధంగా యువతి నిద్రిస్తున్న సమయంలో ముఖంపై దిండుతో గట్టిగా అదిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం అతను అక్కడి నుంచి ఎలాంటి ఆధారాలు లేకుండా పరారయ్యాడు. రెండుమూడు రోజుల తర్వాత ఆ ఇంటి నుంచి దర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తే అసలు విషయం బయటపడిందని.. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని.. అద్దె రూంలో లభించిన మొబైల్ షాపు విజిటింగ్ కార్డు, ఓ షర్ట్ పై ఉన్న స్టిక్కర్ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

Next Story

Most Viewed