కరోనాతో యువ పాత్రికేయుడు మృతి

by  |
కరోనాతో యువ పాత్రికేయుడు మృతి
X

దిశ, బోథ్: బోథ్ మండలం పాట్నా పూర్ గ్రామానికి చెందిన యువ పాత్రికేయుడు కుంరం శ్రీకాంత్(30) కరోనాతో ఆదివారం మధ్యాహనం మృతి చెందాడు. శ్రీకాంత్ కు 4 రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మెరుగైన చికిత్స కోసం అతన్ని ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లగానే అతను మృతి చెందాడు. మృతునికి ఇటీవలే వివహం అయింది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story