కరెంట్ షాక్‌తో యువకుడి మృతి 

by  |
కరెంట్ షాక్‌తో యువకుడి మృతి 
X

దిశ, మహబూబ్‌నగర్: కరెంట్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం పల్లెర గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంతోష్ (21) లైన్ మరమ్మతులు చేసేందుకు స్తంభంపైకి ఎక్కాడు. మరమ్మతులు చేస్తుండగా కరెంట్ సరఫరా అయింది. దీంతో తీవ్రగాయాలపాలైన సంతోష్ అక్కడికక్కడే మృతిచెందాడు. లైన్ మరమ్మతులు చేస్తున్న విషయం ముందుగానే విద్యుత్ అధికారులకు సంతోష్ తెలియజేశాడని, అయినా కరెంట్ సరఫరా చేయడంతో ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Tags: Mahabubnagar, sudden release, current, death of a young man

Next Story

Most Viewed