17 కీలక బిల్లుల ఆమోదం లాంఛనమే

by  |
17 కీలక బిల్లుల ఆమోదం లాంఛనమే
X

దిశ, వెబ్‌డెస్క్: యోగి సర్కార్ 17 కీలక బిల్లులను శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. వీటిని శుక్రవారమే ప్రవేశపెట్టాల్సింది ఉండగా.. బీజేపీ సభ్యుడు జనమేజయ్ సింగ్ మృతి కారణంగా సభ వాయిదా పడింది. దీంతో అసెంబ్లీ తిరిగి శనివారం ప్రారంభంకానుంది. యూపీలో కరోనా విజృంభిస్తుండటంతో సర్కార్ పలు కీలక ఆర్డినెన్స్‌‌లను తీసుకొచ్చింది.

రాజ్యాంగం ప్రకారం వీటికి ఆరు నెలలలోపు అసెంబ్లీ ఆమోదం తప్పనిసరి. ఎమ్మెల్యేల నిధుల వాయిదా, మంత్రులు, ఎమ్మెల్యేల వేతనాల్లో కోత, ఫ్రంట్‌లైన్ వర్కర్లపై దాడుల నిరోధం వంటి కీలక ఆర్డినెన్స్‌లను ప్రభుత్వం తీసుకొచ్చింది. శనివారం జరిగే అసెంబ్లీలో వీటి ఆమోదం లాంఛనప్రాయమే.

Next Story

Most Viewed