- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనా వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో మార్కెట్లు కుదేలవుతుండటంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా మదుపర్లు అమ్మకాల జోరును పెంచారు. మార్కెట్లపై నమ్మకం సడలి బంగారంపై ఆసక్తి చూపిస్తున్నారు. సంక్షోభం కొనసాగుతున్న సమయంలో షేర్ల కంటే సురక్షితమైన బంగారంలో పెట్టుబడి పెట్టడం నయమని పెట్టుబడిదారులు సైతం భావిస్తున్నారు. శుక్రవారం కమొడిటీ మార్కెట్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ. 530 పెరిగి రూ. 43,770కి చేరుకుంది. బంగారం బాటలోనే వెండి సైతం రూ. 1,348 పెరిగి రూ. 41,222 కి చేరుకుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే కొద్ది వారాల్లోనే బంగారం ధర రూ. 45,000కి చేరుకునే అవకాశముందని ట్రేడర్లు భావిస్తున్నారు.
Tags: gold price, gold price, commodity market, silver
Next Story