పసుపు అనకొండ ఇక లేదు 

by  |
పసుపు అనకొండ ఇక లేదు 
X

దిశ, వెబ్ డెస్క్ ‌: ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‌లోని నందన్‌కానన్ జూ లో పసుపు రంగు అనకొండ ప్రాణాలొదిలింది. ఈ అరుదైన పసుపు రంగు అనకొండ మృతిచెందడంపై జూ అధికారులు విచారణ జరుపుతున్నారు. అనకొండ కళేబరానికి పోస్టుమార్టం కూడా చేశారు.

పోస్ట్‌మార్టం రిపోర్టు వస్తే అనకొండ మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందని జూ అధికారులు భావిస్తున్నారు. జూ లో మొత్తం ఆరు అనకొండలు ఉండగా… పసుపు అనుకొండ మృతితో ఐదు అనకొండలు మిగిలి ఉన్నాయని నందన్‌కానన్ జూ డిప్యూటీ డైరెక్టర్ బిమల్ కుమార్ ఆచార్య వెల్లడించారు.



Next Story