ఎల్లంగౌడ్ హత్యకేసు నిందితుల అరెస్ట్…

by  |
ఎల్లంగౌడ్ హత్యకేసు నిందితుల అరెస్ట్…
X

దిశ, మెదక్: సిద్దిపేటలో కలకలం రేపిన రౌడీ షీటర్ ఎల్లం గౌడ్ హత్య కేసులో నిందితులు ఒక్కొక్కరు బయటకొస్తున్నారు. ఇటీవల సిద్దిపేట ఏసీపీ కార్యాలయంలో నలుగురు నిందితులు లొంగిపోయిన విషయం తెలిసిందే. కాగా, ఈ హత్య కేసులోనే పరారీలో ఉన్న చెన్నోజు నవీన్ (22), ఎడా సందీప్ (20)లను అరెస్ట్ చేసినట్లు సిద్దిపేట రూరల్ సీఐ సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ ఇద్దరు నిందితులను వారి స్వగ్రామమైన మిట్టపల్లిలో అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు. వీరి నుంచి రెండు కొబ్బరిబొండాలు కొట్టే కత్తి, ఒక కమ్మ కత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను కూడా పట్టుకుంటామని సీఐ సురేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

tag: Yellam Goud murder case, Arrest, suspects, siddipet

Next Story