మండలిలో పెరగనున్న వైసీపీ బలం

by  |
మండలిలో పెరగనున్న వైసీపీ బలం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ శాసనమండలిలో ఏడుగురు టీడీపీ ఎమ్మెల్సీల పదవీకాలం రేపటితో ముగియనుంది. దీంతో మండలిలో టీడీపీ బలం 22 నుంచి 15కి తగ్గనుండగా.. వైసీపీ బలం మరింత పెరగనుంది. ఇటీవలే వైసీపీకి చెందిన నలుగురు నేతలు గవర్నర్ కోటాలో శాసనమండలికి ఎన్నికయ్యారు. దీంతో వైసీపీ బలం రేపటి నుంచి 20కి చేరుకోనుంది.

ఇప్పటివరకు శాసనమండలిలో టీడీపీ బలం ఎక్కువగా ఉంది. దీని వల్ల ప్రతిపక్ష టీడీపీ కొన్ని బిల్లులను అడ్డుకుంది. ఇప్పుడు వైసీపీ బలం పెరగడంతో.. ప్రభుత్వ బిల్లులను అడ్డుకునే పరిస్థితి టీడీపీకి లేకుండా పోయింది.

Next Story

Most Viewed