అయోధ్య రామాలయ నిర్మాణానికి ఏపీ అసమ్మతి ఎంపీ విరాళం

by  |
అయోధ్య రామాలయ నిర్మాణానికి ఏపీ అసమ్మతి ఎంపీ విరాళం
X

దిశ, వెబ్ డెస్క్: అయోధ్యలో రామాలయం నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. ఆగష్టు 5న జరగనున్న ఆలయ నిర్మాణానికి ప్రధాని మోదీ భూమి పూజ చేయనున్నారు. ఆలయ నిర్మాణానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విరాళం ఇచ్చారు. తన మూడు నెలల ఎంపీ జీతాన్ని ప్రధాని ఖాతకు జమ చేశారు. ఆలయ నిర్మాణానికి తన వంతుగా ఈ విరాళాన్ని ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఎంపీ లేఖ రాశారు. ఆలయ భూమి పూజ కోసం కోట్లాది మంది హిందువులు ఆత్రుతగా ఎదురుచుస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇక ఈమేరకు ఆయన చేసిన ట్వీట్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షాలకు ట్యాగ్ చేయడం రాజకీయంగా చర్చకు తెరలేపింది.

Next Story

Most Viewed